Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ఈ ఏడాది తొలి ట్రేడింగ్ సెషన్ లో ఇన్వెస్టర్లు పాజిటివ్ గా స్పందించారు. జీఎస్టీ వసూళ్లు పెరగడం, వాహనాల విక్రయాలు రికార్డు స్థాయికి పెరగడం వంటివి ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడి 61,167కి చేరుకుంది. నిప్టీ 92 పాయింట్లు పెరిగి 18,197 వద్ద స్థిరపడింది.