Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ భామ నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో మైరాన్ తో పాటు, హైదరాబాదుకు చెందిన బిజినెస్ మేన్ కృష్ణకిశోర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైరాన్ మోహిత్ దేశంలో ప్రముఖ డీజేగా, ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ గా గుర్తింపు పొందాడు. దేశంలో అనేక చోట్ల డీజే పార్టీలు, ఈవెంట్లు నిర్వహించే మైరాన్... డీజే ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నట్టు గుర్తించారు. గత 12 ఏళ్లుగా అతడు డ్రగ్స్ సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. టాలీవుడ్ నటి నేహా దేశ్ పాండేను పెళ్లాడిన మైరాన్ ముంబయి కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి పలు భాషల సినీ పరిశ్రమల్లోని వ్యక్తులతోనూ, వ్యాపారవేత్తలతోనూ పరిచయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. మైరాన్ ను పోలీసులు హైదరాబాదులోని ఓ పబ్ లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.