Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న స్వప్న(17) అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుమల కాసాని రెసిడెన్సీలో సెకండ్ ఫ్లోర్ 216లో రామదుర్గా ప్రసాద్, అరుణ దంపతులు నివాసముంటున్నారు. వీరి కూతురు స్వప్న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.