Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
18 గ్రాండ్స్లామ్ సింగిల్స్ చాంపియన్షిప్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. న్యూయార్క్లో ఆమె చికిత్స తీసుకోనున్నారు. కేన్సర్తో తాను పోరాడతానని మార్టినా ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్టినా 2010లోనే బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. ఆ తర్వాత ఆమె శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ చేయించుకుని బయటపడ్డారు. ఇప్పుడు మరోమారు ఆమెను కేన్సర్లు చుట్టుముట్టాయి. అయితే, ఇవి ప్రారంభ దశలోనే ఉన్నాయని, కోలుకుంటానని 66 ఏళ్ల మార్టినా ఆశాభావం వ్యక్తం చేశారు. చికిత్సకు కేన్సర్ రకం స్పందిస్తున్నట్టు చెప్పారు. రెండు కేన్సర్లు తీవ్రమైనవే అయినా కోరుకున్న ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వాటితో తాను పోరాడతానని ధైర్యం ప్రదర్శించారు. 9 సార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన మార్టినా నవ్రతిలోవా ఈ ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఓ టెన్నిస్ చానల్లో కామెంటరీ చెప్పాల్సి ఉంది. అంతలోనే ఆమెకు కేన్సర్లు నిర్ధారణ కావడం అభిమానులను కలవరపరుస్తోంది. గొంతు కేన్సర్ మొదటి దశలోనే ఉందని, ఈ నెల నుంచే ఆమెకు చికిత్స ప్రారంభమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు సోకిన కేన్సర్ హెచ్పీవీ రకమని, ఇది చికిత్సకు స్పందిస్తుందని పేర్కొన్నారు.