Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వంలో జలసౌధలో ప్రారంభమైంది. భేటికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పీషల్ సీఎస్ రజత్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. గోదావరి నదిపై గూడెం, మోదీకుంట ప్రాజెక్టుల డీపీఆర్లు, సీడ్ మని, టెలీమెట్రిల ఏర్పాటు, బోర్డు ఉద్యోగులు తదితర అంశాలపై చర్చించనున్నారు. భేటీకి హాజరైన తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్ మాట్లాడారు. బోర్డు మీటింగ్లో పలు అంశాలపై చర్చ జరుగుతుందన్నారు.