Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో 61,316 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 05 పాయింట్లు లాభపడి 18,237 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.81 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్యూఎల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, విప్రో, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.