Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మంచిర్యాల: మందమర్రి టోల్ప్లాజా సిబ్బందిపై బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి పాల్పడారు. గత నెలలో ప్రారంభమైన మందమర్రి టోల్ప్లాజా వద్ద వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వాహనం అక్కడకు చేరుకోగానే టోల్ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కారు దిగి.. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.