Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని వీరాపూర్, బేగంపేట, తలారివానిపల్లి, వడ్లూర్, తోటపల్లి గ్రామాల్లోని లబ్ధిదారులకు బుధవారం మండలాద్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులందజేశారు.ప్రభుత్వం అందజేస్తున్న కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రజలకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయని ఎమ్మెల్యే రసమయి తెలిపారు.అయా గ్రామాల సర్పంచులు గన్నమనేని అనిత,సంజీవ రెడ్డి,వంకాయల సరిత, నర్సింగరావు,ఎఎంసీ డైరెక్టర్,రజక సంఘం మండలాద్యక్షుడు దీటీ రాజు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, కనగండ్ల తిరుపతి, బోయినిపల్లి శ్రీనివాస్ రావు, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.