Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలో హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11 నుంచి మళ్లీ ఫార్ములా ఈ రేస్ కార్లు సందడి చేయనున్నాయి. ఈ మేరకు దానికి సంబంధించిన టికెట్లను నిర్వాహకులు ఇవాళ విడుదల చేశారు. రూ.1000 నుంచి రూ.10,000 వేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1,000 గ్రాండ్ స్టాండ్, రూ.3,500కు ఛార్జ్ గ్రాండ్ స్టాండ్, రూ.6,000కు ప్రీమియం గ్రాండ్ స్టాండ్, రూ.10వేలకు ఏస్ గ్రాండ్ స్టాండ్ టికెట్లు ఉన్నాయి. టికెట్ల విడుదల కార్యక్రమానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో టాప్ 25 నగరాల్లో ఒకటిగా నిలించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 11 నుంచి ఈ ఫార్ములా ఈ-రేసింగ్ ప్రారంభం కానుండగా.. 10వ తేదీన ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 11 దేశాల నుంచి 22 మంది డ్రైవర్లు పోటీ పడనున్నట్లు వెల్లడించారు.