Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టుకు వాహనం బలంగా ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎల్లమ్మ దేవి దర్శనం కోసం సవదత్తి ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చెట్టుకు వాహనం బలంగా ఢీకొట్టడం వల్లే ఆరుగురు చనిపోయినట్లు వెల్లడించారు. మృతులంతా హులకుంట గ్రామస్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిద్ర మత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి గల కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.