Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు కొంత కోలుకోవడంతో చివరకు నష్టాలు కొంత మేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు కోల్పోయి 60,353కి పడిపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 17,992 వద్ద స్థిరపడింది.