Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కృష్ణా నది తీరంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రయాణికులను చేరవేసే మరబొట్లకు లంగరు పడింది. కొందరు ప్రయివేటు బోటు నిర్వాహకులు తెలంగాణ ప్రాంత బోట్లను అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాణ నుంచి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, సంగమేశ్వరాలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనాదిగా పుట్టిల నుంచి మర పడవల వరకు ఆటుపోట్లను అధిగమిస్తూ ప్రయాణికులను చేరవేసిన తెలంగాణ మర బోటు నిర్వాహకులు ఆంధ్ర ప్రాంత పెత్తందారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతులు లేకుండా నడుస్తున్న మరబొట్ల వాహకుల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది.