Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ను స్టేషన్కు తరలించేందుకు పోలీస్ వాహనంలో ఎక్కించారు. పోలీస్ వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో వెహికల్ అద్దాలు పగిలాయి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్, రైతు ఆత్మహత్యకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.