Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన పంత్ను ఇటీవల బీసీసీఐ ముంబయికి తరలించింది. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో ప్రస్తుతం పంత్కు చికిత్స జరుగుతోంది. కాగా, పంత్కు కుడి మోకాలి లిగమెంట్కి వైద్యులు సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం సుమారు 10.30 గంటలకు డాక్టర్ పార్దివాలా, అతని బృందం పంత్ కుడి మోకాలి లిగమెంట్కి సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. సుమారు 2 నుండి 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.