Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్గా ఏఐసీసీ అధిష్టానం మాణిక్రావు థాకరేను నియమించింది.
మాణిక్రావు థాకరే మహారాష్ట్రకు చెందిన నేత. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ తరుణంలో ఈనెల 11న టీ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మానిక్ రావ్ థాకరే హైదరాబాద్ రానున్నారు. 11 తేదీన 10 గంటలకు హైదరాబాద్ చేరుకుని తొలుత 11 గంటలకు ఏఐసీసీ సెక్రటరీ లతో సమావేశమవుతారు.
అనంతరం 11:30గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. 12 గంటలకు సీఏల్పీ నేత తో మీటింగ్ అవుతారు. 12:30 సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లతో చర్చిస్తారు. 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగులో పాల్గొంటారు. 4 గంటలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తారు. 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశమవుతారు. తిరిగి 12 తేదీ న ఉదయం 10:30కి డీసీసీ అధ్యక్షులతో సమావేశమై వెంటనే 11:30 గంటలకు అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ కానున్నారు థాకరే. 12:30 గంటలకు పార్టీలోని వివిధ సెల్స్ ,డిపార్ట్మెంట్ అధ్యక్షులతో మీటింగులో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు థాకరే తిరిగి ఢిల్లీ వెళ్తారు.