Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20ల్లో మూడో శతకం నమోదు చేశాడు. తన స్టయిల్ షాట్లతో లంక బౌలర్లపై విరుచుకుపడిన సూర్య స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నిర్ణిత 20 ఓవర్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో లంకకు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సూర్యాకుమార్ 51 బంతుల్లో 112 పరగులు చేశారు. శుభ్మన్ గిల్ 46 , రాహుల్ త్రిపాఠి 35 రాణించారు. దీపక్ హుడా (4), ఇషాన్ కిషన్ (1) విఫలం అయ్యారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.