Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఢీల్లి
ఢిల్లీలోని భాజన్ పురలో ఉంటున్న ఓ బాలిక కిందటేడాది తనపై లైంగిక దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. తన ఏరియాలో ఉండే బాలుడు ఒకరు తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలితో పాటు నిందితుడు కూడా మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకున్నారు.
ఈ తరుణంలో తనపై లైంగిక దాడి చేసిన బాలుడిపై కోపాన్ని ఆమె తల్లిపై చూపించింది అమ్మాయి. తుపాకీతో ఆ బాలుడి తల్లిపైన కాల్పులు జరిపింది. శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.