Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఢిల్లీలోని ఓఖ్లా ఫేజ్ 1 ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్ధలానికి 16 అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లిన సమాచారం లేదని వెల్లడించారు. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతుండగా, భవనంలోపల ఎవరూ చిక్కుకోలేదని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటనే వివరాలు ఇంకా వెలుగుచూడలేదని అధికారులు తెలిపారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.