Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య భేటీ జరగడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. దీనిపై మంత్రి రోజా స్పందింస్తూ విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ ను పరామర్శిస్తాడని, చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కల్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని రోజా మండిపడ్డారు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా..! అంటూ రోజా ట్వీట్ చేశారు.
అయితే చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీని స్వాగతించారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయవాదంతో బీఆర్ఎస్ గా మారిందని, ఏ పార్టీ ఎక్కడ్నించి అయినా పోటీ చేయొచ్చని అన్నారు.