Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తయిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు గతంలో మాదిరిగానే తిరుపతిలోని 3 ప్రాంతాల్లో (అలిపిరి భూదేవి కాంప్లెక్సు, శ్రీనివాసం, గోవిందరాజస్వామి రెండో సత్రం) యథావిధిగా జారీ చేస్తామని తెలిపారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను ఈనెల 9న (సోమవారం) ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300ల టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్టు తితిదే వెల్లడించింది. ఈ మేరకు భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.