Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి, సమీకృత కలెక్టరేట్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. మరికొన్ని తుదిదశ నిర్మాణ పనులు సాగుతున్నాయి.