Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ స్కీం పథకంలో భాగంగా తొలి బ్యాచ్ సిద్దం అయింది. ఈ తరుణంలో శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్లకు స్వాగతం పలికారు ఆర్మీ ఉన్నతాధికారులు.
ఈ క్రమంలో బిగ్రేడియర్ రాజీవ్ చౌహన్ మాట్లాడుతూ అగ్నివీరులకు శిక్షణ ఇవ్వడంలో బెస్ట్ క్యాంపస్ గోల్కొండ అన్నారు. అగ్నివీర్ శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నామంటున్నారు. 300 మంది సభ్యులు ఈ సెంటర్ కు వచ్చారన్నారు. వీరంతా దేశంలోని పలు రీజియన్లకు చెందినవారని, 3300 మంది అగ్నివీర్లు ఫిబ్రవరి చివరిలో సైన్యంలో చేరబోతున్నారని ఆయన తెలిపారు. మొత్తం 5500 మందికి గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో శిక్షణ ఇవ్వబోతున్నాం అని, ఏడాది పాటు ఆర్టిలరీ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చామన్నారు. జనవరి ఒకటితో అగ్నివీర్ల శిక్షణ పూర్తయ్యిందరి చౌహాన్ వివరించారు.