Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ బ్యాలెన్స్ డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముంబైకి చెందిన లైగర్ మొబిలిటీ తీసుకు వస్తోంది. అంతే కాదు, ఈ స్కూటర్ లో సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. దేశీయంగా అభివృద్ది చేసిన విప్లవాత్మక టెక్నాలజీని ఈ స్కూటర్ లో చూస్తారని తయారీ సంస్థ లైగర్ మొబిలిటీ అంటోంది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ వల్ల నడిపే వారికి భద్రత, మెరుగైన రైడింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. త్వరలో జరిగే ఆటో ఎక్స్ పో 2023 లో ఈ స్కూటర్ ను ప్రదర్శించనున్నారు. చూడ్డానికి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, వెస్పా మాదిరే ఉంటుంది. ఈ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెట్రో స్టయిల్ తో ఉంటుంది. విశాలమైన సీట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఫోర్క్ ఉంటుంది. అలాయ్ వీల్స్ తో, ముందు డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ ఉంటాయి.