Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. రూ.2 కోట్లు దోపిడీ అయినట్లు అధికారులు గుర్తించారు. హవాలా డబ్బులే దోపిడీకి గురైనట్లు పోలీసులు తేల్చారు. అమెరికా నుంచి ప్రవీణ్ పంపుతున్న డబ్బులు హైదరాబాద్లో మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రియాసత్నగర్లోని ఫారుఖ్కు హవాలా డబ్బులు చేరుతున్నాయి. అమెరికా నుంచి ఇప్పటివరకు ఫారూఖ్కు రూ.28 కోట్లు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఏంఆర్ఆర్ బార్ యజమాని వెంకట్రెడ్డి, షారుఖ్ కలిసి హవాలా లావాదేవీలు జరపుతున్నారు. పరారీలో ఉన్న షారుఖ్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు.