Authorization
Sat May 17, 2025 05:18:14 am
నవతెలంగాణ : టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. రేపటి నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు చెప్పాయి. బుమ్రా చివరిసారిగా సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లోఆడాడు. అప్పటి నుంచి బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఏ ఫార్మాట్లోనూ ఆడలేదు. టీ20 ప్రపంచ కప్లోనూ చోటు కోల్పోయాడు.
శ్రీలంక మూడు వన్డేల సిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్,చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.