Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : రద్దీ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దోపీడీపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాల డీటీసీలతో రవాణా శాఖ కమిషనర్ ఆంజనేయులు సమావేశమయ్యారు. సంక్రాంతి రద్దీ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తనిఖీ చేయాలని ఆదేశించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైయివేట్ బస్సుల్లో 10 రోజులపాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు రవాణాశాఖ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిట్నెట్, ఇతర ధ్రువపత్రాలు లేని బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు. గమ్యస్థానం చేరాకే బస్సులను సీజ్ చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ బుకింగ్లో వసూలు చేసే ఛార్జీలు చూసి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రయాణికులు కూడా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. రవాణాశాఖ వెబ్సైట్లోని ఫోన్ నెంబర్లకు కూడా ఫిర్యాదు చేయచ్చన్నారు. గతేడాది 975 కేసులు, రూ.62 లక్షల జరిమానా విధించాం. తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేస్తాం. ఆర్టీసీ బస్టాండ్ల వద్దకు ప్రైవేట్ బస్సులు రాకుండా చర్యలు తీసుకుంటాం. సంబంధంలేని లగేజీ తరలించే ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేస్తాం. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను స్టేజ్ క్యారియర్లుగా తిప్పడం నేరం్ణ్ణ అని వెంకటేశ్వరరావు తెలిపారు.