Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. మంగళవారం రాత్రి ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపని కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి అని, 350 కి.మీ. రేంజ్లోని లక్ష్యాలను ఛేదిస్తుందని వెల్లడించింది. పృథ్వీ సిరీస్లో రూపొందించిన ఈ బాలిస్టిక్ మిస్సైల్తో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరినట్లయిందని పేర్కొన్నది. స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్పై నడిచే ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలు పదార్థాలను మోసుకెళ్లగలుగుతుందని చెప్పింది.