Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : ముస్లింలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు భయపడాల్సిన పని లేదని, అయితే వారు తమ ఆధిపత్యపు ఆలోచనలను విడిచిపెట్టాలని మోహన్ భగవత్ అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.వెయ్యి సంవత్సరాలకు పైగా భారతదేశంపై విదేశీయుల దురాక్రమణలు, విదేశీ కుట్రలు జరిగాయని అయినా నాటి నుంచి అవిభాజ్య దేశంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నేడు హిందూ సమాజం మేల్కొందని ఆయన చెప్పారు. 'హిందూస్థాన్ దేశంలో నివశిస్తున్న ముస్లింలకు ఎలాంటి హాని లేదు. వారు భయపడాల్సిన పని లేదు. అయితే వారు ఆధిపత్యపు భావజాలాన్ని విడిచిపెట్టాలి' అని భగవత్ పేర్కొన్నారు. సంఘ్ రోజువారీ రాజకీయాలకు దూరంగా ఉందని, అయితే మన జాతీయ ప్రయోజనాలు, హిందూ ప్రజల ప్రయోజనాలను ప్రభావితం చేసే రాజకీయాలతో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉందని భగవత్ చెప్పారు.