Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. బుధవారం ఉదయం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా చినార్ క్రాప్స్కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు లోయలోకి జారిపడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ట్రాక్పై దట్టమైన మంచు కురవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు.