Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం 'గోల్డెన్ గ్లోబ్' అందడం పట్ల అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. ఈమేరకు సంగీత దర్శకుడు కీరవాణి ఇతర చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. 'ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటునాటు'కి గానూ కీరవాణి గోల్డెన్గ్లోబ్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. 'ఆర్ఆర్ఆర్' టీమ్కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే 'నాటునాటు'. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. చరణ్ , తారక్తోపాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్కు కంగ్రాట్స్' అని పేర్కొన్నారు.