Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న మాణిక్రావ్కు శంషాబాద్ ఎయిర్పోర్టులో నేతలు స్వాగతం పలికారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పార్టీలో నెలకొన్న వివాదాలపై రేవంత్, భట్టి విక్రమార్కతో ఆయన చర్చించారు. అనంతరం గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో ఠాక్రే పాల్గొన్నారు. మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, గీతారెడ్డిలతోపాటు 26మంది సినీయర్ నేతలతో ఠాక్రే వేర్వేరుగా సమావేశమయ్యారు. మరోవైపు ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరుకావాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందించారు. గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమైన ఠాక్రే.. నాయకుల మధ్య విభేదాలు నెలకొనేందుకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యులతో ఠాక్రే సమావేశం కానున్నారు. గురువారం డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.