Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లోని కూకట్పల్లిలో సందడి చేశారు. నందమూరి నటసింహం నటించిన వీరసింహా రెడ్డి సినిమా ఉదయపు ఆటతో రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ‘వీరసింహా రెడ్డి’ బెనిఫిట్ షో ప్రదర్శించారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్తో థియేటర్ నిండిపోయింది. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పులు, బ్యాండ్బాజాలతో తమ అభిమానహీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని, వారి స్పందన బాగుందని బాలకృష్ణ చెప్పారు. సంక్రాంతి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా నేడు వీరసింహా రెడ్డి సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. విదేశాల్లో తెల్లవారుజామున 2 గంటలకే షోలు మొదలయ్యాయి.