Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డోబ్రియాల్ హెచ్చరించారు. వీటి విక్రయాలు జరుగకుండా ఐదు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని, చైనా మాంజాను రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై బుధవారం హైదరాబాద్ అరణ్యభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. చైనా మాంజా వినియోగం వల్ల మనుషులు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుందని డోబ్రియాల్ అన్నారు. ‘పతంగులతోపాటు పక్షులనూ ఎగరనిద్దాం’ అన్న నినాదంతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సూచించారు. చైనా మాంజాలకు బదులు సంప్రదాయ కాటన్ దారాలు వాడాలని.. ఎక్కడైనా చైనా మాంజాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్లు 040-23231440, 18004255364 సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.