Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులతోపోలిస్తే కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,89,724 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 197 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,583కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,309 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఒకరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,723కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.15 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.