Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
జార్ఖండ్లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఖర్సావాన్ జిల్లాలో కూలీలను తీసుకెళ్తుండగాఒకటి బోల్తా పడటంతో ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రాజ్నగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం జరుపుతున్నారు. అతివేగంగా ఉన్న వ్యాన్ను లక్డా కొచ్చా మలుపు వద్ద తిప్పేందుకు డ్రైవర్ ప్రయత్నించి విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
వ్యాను క్యాబిన్పైన కూడా కూలీలు కూర్చున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం పట్ల సీఎం హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూలీలతో నిండిన ఈ వ్యాన్ వేగం ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తున్నది. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని జమ్షెడ్పూర్లోని ఎంజీఎం ఆస్పత్రిలో తరలించారు. చైబాసా నుంచి రాజ్నగర్ వైపు వెళ్తున్న ఈ పికప్ వ్యాన్లో దాదాపు 30-35 మంది కూలీలు ఉన్నారు. రాజ్నగర్లోని హంసాల్లో ఫౌండ్రీ పనిచేసేందుకు వీరంతా బయల్దేరినట్లు సమాచారం. కూలీలు పశ్చిమ సింగ్భూమ్లోని గలుబాసా, గాగ్రీ నివాసితులు.