Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ. 33 లక్షల విలువైన 533 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడుని కస్టమ్స్ అధికారులు తనిఖి చేశారు. మొబైల్ ఫోన్ కవర్ లో బంగారాన్ని దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.