Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జనవరి 18న హైదరాబాద్లో జరగనుంది. భారత పర్యటనలో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ మూడు వన్డేల సిరీస్, 3 టీ20ల సిరీస్ ఆడనుంది. రెండో వన్డే జనవరి 21న రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో, మూడో వన్డే జనవరి 24న ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్డేడియంలో జరగునున్నాయి.
తొలి వన్డేకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ టికెట్లను జనవరి 13 నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ తెలిపాడు.