Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. శరద్ యాదవ్ మృతిపట్ల ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోదరుడు శరద్ యాదవ్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ నుంచి తాను, శరద్ యాదవ్, దివంగత ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్ సోషలిజం రాజకీయాలను నేర్చుకున్నాం. చాలా సందర్భాల్లో శరద్ యాదవ్తో తాను గొడవపడ్డాను. కానీ తామిద్దరిమధ్య అభిప్రాయ భేదాలున్నప్పటికీ అవి తమ సంబంధాలను దెబ్బతీయలేదని ట్విట్టర్ వేదికగా లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.