Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం ఇద్దరు బాలింతలు మృతి చెందారు. బాలింతలు అనారోగ్యంతో మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా అక్కడ ఆస్పత్రి సిబ్బంది బాలింతలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింతలు మృతి చెందారు. మలక్ పేట వైద్యుల నిర్లక్ష్యం వలనే బాలింతలు మృతి చెందారని మృతువుల బంధువులు ఆరోపించారు. బాలింతల కుటుంబ సభ్యులు , బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. చాదర్ ఘాట్ పోలీసులకు బాలింత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.