Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ బహదూర్పురా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తి ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. అయితే తన ఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని బాధిత వ్యక్తి ఎస్ఐ శ్రవణ్ కుమార్ను సంప్రదించాడు. ఈ తరుణంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్ఐ రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.