Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సంక్రాంతికి ముందు సెషన్ లో మార్కెట్లు లాభాల పైపుగా కదిలాయి. మధ్యాహ్నం వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత లాభాల్లోకి మళ్లాయి. అమెరికా సహా భారత్ లో ద్రవ్యోల్బణం తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 60,261కి పెరిగింది. నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకుని 17,956 వద్ద స్ధిరపడింది. మెటల్, టెక్, పవర్, ఐటీ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.