Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. కామారెడ్డి కలెక్టర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని రైతులు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి కారణమైన కలెక్టర్, ఎస్పీపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని రైతులు ఆరోపించారు. మాస్టర్ ప్లాన్లో తమ భూములు లాక్కోవడం అన్యాయమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.