Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇది విషాద ఘటన. ఓ ప్రయాణికుడు విమానంలో ప్రయాణిస్తూ.. ఆకస్మాత్తుగా రక్తం కక్కున్నాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఇండోర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. బాధిత ప్రయాణికుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. మధురై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో 60 ఏండ్ల వృద్ధుడు ప్రయాణిస్తున్నాడు. అయితే అతను ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. రక్తం కక్కున్నాడు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది.. ఇండోర్లోని దేవి అహిల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు. బాధిత వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని నోయిడాకు చెందిన అతుల్ గుప్తాగా గుర్తించారు. అయితే గుప్తా గుండె సంబంధిత వ్యాధితో, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గుప్తా మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.