Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం వంశంలో ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ ఇకలేరు. టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని హైదరాబాద్లోని ఆయన కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. శనివారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలిపింది. ఆయన కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్లో నిర్వహించనున్నట్లు, దీనికి సంబంధించిన షెడ్యూలును విడుదల చేస్తామని తెలిపింది.
బహదూర్ వయసు 89 సంవత్సరాలు. హైదరాబాద్ చిట్టచివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్కు ఆయన మనుమడు. అలీ ఖాన్కు వారసుడిగా ఉన్నారు. ముకరంజా అసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్.