Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరబాద్
భారత్ - శ్రీలంక జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో కరుణరత్నె బౌలింగ్లో విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టగా ఆ బంతిని ఆపేందుకు డీప్ స్క్వేర్, మిడ్ వికెట్ ఫీల్డర్లు వాండర్సే, అషేన్ బండారా ప్రయత్నించారు. ఈ తరుణంలో ఒకరినొకరు ఢీకొట్టుకోవడంతో గాయపడ్డారు. వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చారు. బండారాను స్ట్రెచర్ మీద ఆస్పత్రికి తరలించారు.
మోకాలికి సంబంధించి స్కాన్ తీసిన అనంతరమే బండారా పరిస్థితి ఏంటనేది తేలుతుంది. వాండర్సే కూడా కాస్త గాయపడినప్పటికీ అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. గాయపడిన శ్రీలంక ఆటగాళ్లకు సహాయం చేసేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ కూడా ముందుకొచ్చింది. కాసేపు ఆటకు అంతరాయం కలిగినప్పటికీ వారిని ఆస్పత్రికి తరలించిన అనంతరం మ్యాచ్ను అంపైర్లు కొనసాగించారు.