Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముంబయి: ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులేకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం పుణెలో ఓ కరాటే పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. ప్రమాదవశాత్తు దీపం తగిలి ఆమె చీరకు నిప్పంటుకుంది. అయితే, వెంటనే అప్రమత్తమైన ఆమె స్వయంగా మంటలను ఆర్పివేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.