Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: మహిళలు ఎన్జీవోల్లో పనిచేయకూడదంటూ తాలిబన్లు ఇటీవలే కొత్త ఆంక్షలు విధించారు. దీంతో అక్కడి యూనివర్సిటీ విద్యార్థినిలు, మహిళా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు. తాలిబన్ల తీరుపై దేశంలో చాలా చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా, జర్మనీ, ఈయూ దేశాలతోపాటు ఐరాస విభాగాలు కూడా తాలిబన్ల చర్యలను ఖండిస్తూ ఆంక్షలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశాయి. అటు ముస్లిం దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా తాలిబన్ చర్యలను తప్పుపట్టింది. అయినప్పటికీ తాలిబన్లు మాత్రం తమ ఆంక్షలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ‘షరియా చట్టం ప్రకారమే అన్ని విషయాలపై నియంత్రణ ఉంటుంది. మహిళా హక్కుల ఆంక్షలపై వస్తోన్న ఆందోళనలపై తాలిబన్ నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. దేశంలో ఇస్లామిక్ చట్టాన్ని అతిక్రమించే ఎటువంటి చర్యలనైనా తాము అనుమతించం.’ అని తాలిబన్ అధికార ప్రతినిధి జాబివుల్లా ముజాహిద్ వెల్లడించినట్టు అక్కడి ఖామా ప్రెస్ తెలిపింది.