Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో గంగుల కమలాకర్ తండ్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే, గంగుల కమలాకర్ కు సీఎం కేసీఆర్ తో సహా అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ స్వయంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి, ఆయనను పరామర్శించనున్నారు. ఈ మేరకు ఇవాళ కరీంనగర్కు వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ నేపథ్యంలో ఉన్నత అధికారులు అందరూ సీఎం కేసీఆర్ టూర్ కు సంబంధించిన ప్లాన్ ను సిద్ధం చేశారు.