Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
శ్రీహరికోటలో సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీహరికోటలోని రాడార్ సెంటర్లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. మృతుడు చత్తీస్ఘడ్కు చెందిన చింతామణిగా గుర్తించారు. జనవరి 10న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో చింతామణి డ్యూటీలో చేరారు. ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.