Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 91 పాయింట్ల లాభంతో 60,353 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 17,973 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.31 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.